Friday, March 29, 2024

రేపు BRS లోకి ఏపీ నుంచి భారీగా చేరిక‌లు..

భారత రాష్ట్ర సమితిని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ లో కూడా తన కార్యకలాపాలను చురుకుగా కొనసాగిస్తోంది బీ ఆర్ఎస్. ఇతర పార్టీల నేతలు, అసంతృప్త నేతలు, మాజీ రిటైర్డ్ అధికారులను బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలోకి చేరికలను మొదలు పెట్టేశారు. ఏపీకి చెందిన పలువురు నేతలు రేపు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మాజీ మంత్రి రావెల కిషోర్, తోట చంద్రశేఖర్, పార్థసారథి, తదితర నేతలు రేపు మధ్యాహ్నం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement