Thursday, April 18, 2024

ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు సీరియస్

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్ట్‌ 1లోగా నరేగా బకాయిలు చెల్లించకపోతే కోర్టుకు హాజరై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బిల్లులు చెల్లించకపోతే ఆగస్ట్‌ 1న, పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌, ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హాజరుకావాలని కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అమలు చేయడంలేదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పించుకుంటారని నిలదీసింది.

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఎదుట నరేగా నిధులపై విచారణ చేపట్టారు. వివిధ పిటిషన్లను కలిపి హైకోర్టు ధర్మాసనం విచారించింది. సీఎస్‌ ఆథిత్యనాథ్‌ను కూడా పిలిపించాలని హైకోర్టు తొలుత భావించింది. నిధులు వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు. ఆగస్టు 1వ తేదీలోపు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా సుమారు 2,500 కోట్ల నరేగా నిధులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వార్త కూడా చదవండి: హింసించే భార్యపై భర్తలు కేసు పెట్టవచ్చన్న కోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement