Thursday, April 25, 2024

ఏపీ ప్రభుత్వానికి ఊరట.. పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పేదలందరికీ ఇళ్లు’ నిర్మాణ పథకానికి మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ మంగళవారం రద్దు చేసింది. దీంతో ఇళ్ల స్థలాలపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను పిటిషనర్లు వెనక్కి తీసుకున్నారు.

కాగా, గత నెల 8న పేదలందరికీ స్థలాలు పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లలో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పిచ్చిన విషయం తెలిసిందే. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు డివిజన్‌ బెంచ్‌ తీర్పునిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement