Saturday, April 20, 2024

మాన‌సిక రోగుల‌కు ఎలాంటి వైద్యం అందిస్తున్నారు?

కరోనాకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలని, ఎక్కువ పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. క‌రోనా, బ్లాక్ ఫంగ‌స్ కేసులు, వ్యాక్సినేష‌న్ వంటి అంశాల‌పై గురువారం హైకోర్టులో విచార‌ణ జరిగింది. ఈ సంద‌ర్భంగా ఏపీలో మూడో ద‌శ క‌రోనా వ్యాప్తి జ‌రిగితే దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఇప్ప‌టికే ఏపీలో 26,325 మంది వైద్య, ఇత‌ర‌ సిబ్బందిని నియ‌మించామ‌ని తెలిపింది. 1300 కి పైగా యాక్టివ్‌ బ్లాక్ ఫంగ‌స్ కేసులు ఉన్నాయ‌ని వివ‌రించింది. అలాగే, మూడో ద‌శ క‌రోనా వ్యాప్తి జ‌రిగితే పిల్ల‌ల‌కు భారీగా సోకుతుంద‌న్న అంచ‌నాలు నిర్ధార‌ణ కాలేద‌ని ప్ర‌భుత్వం తెలిపింది.

ప్రభుత్వ వాదన అనంతరం.. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం స‌మ‌ర్థంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఒప్పంద న‌ర్సుల‌కు బ‌కాయి ఉన్న వేత‌నాలు చెల్లించాల‌ని చెప్పింది. క‌రోనా వేళ మాన‌సిక రోగుల‌కు ఎలాంటి వైద్య చికిత్సలు అందిస్తున్నార‌ని కోర్టు ఆరా తీసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌పై విచార‌ణ‌ను కోర్టు సోమ‌వారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్న వర్షాలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement