Friday, March 29, 2024

జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

జడ్జి రామకృష్ణకు షరతులతో కూడిన బెయిల్​ను హైకోర్టు మంజూరు చేసింది. విచారణాధికారికి సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసు అంశంపై మీడియాతో మాట్లాడవద్దని తెలిపింది. ఈ మేరకు జడ్జి రామకృష్ణకు రూ.50 వేల పూచీకత్తుతో హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణ ఏప్రిల్ లో అరెస్ట్ అయ్యారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య ఫిర్యాదుతో ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 124ఏ కింద పీలేరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement