Thursday, April 25, 2024

సీపీఐ నేత రామకృష్ణ పాద‌యాత్ర‌కు హైకోర్టు అనుమ‌తి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ సీపీఐ నేత రామకృష్ణ పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. కడప స్టీల్ ప్లాంట్ సాధన కోసం ఈనెల 9వ తేదీ నుంచి 13వరకు సీపీఐ నేత రామ‌కృష్ణ‌ పాదయాత్ర నిర్వహించనున్నారు. పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో సీపీఐ నేత‌ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement