ప్రభన్యూస్, అమరావతి: ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో గవర్నర్ బిశ్వభూషన్ ప్రమాణ బుధవారం స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయవాదులు హాజరయ్యారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement