Saturday, April 20, 2024

పీఆర్సీ అమలు చేయకపోతే ఉద్యమిస్తాం

వైద్య,ఆరోగ్య సిబ్బంది పీఆర్సీని వెంటనే అమలు చేయాలని లేదంటే ఉద్యమిస్తామని ఏపీఎన్జీవోస్ కార్యదర్శి సత్యనారాయణ హెచ్చరించారు. నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వద్ద బుధవారం పిఆర్సిని వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఆర్సి నివేదిక వచ్చి ఏడాది గడిచినా.. దానిని బహిర్గతం చేయకుండా ప్రభుత్వ ఉన్నత అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ రెండు దఫాలుగా రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు జరిగినప్పటికీ ఇంతవరకు కూడా దానిపై ఇలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు.  తప్పని పరిస్థితుల్లో నిరసనలు చేస్తున్నామని, ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని తమకు రావాల్సిన పిఆర్సి,  డీఏలు  విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా సిపిఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల క్రమబద్ధీకరణ తక్షణమే  అమలు చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement