Thursday, April 18, 2024

AP: ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా

ఏపీ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్‌ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. జూన్ 3 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 23 నుంచి 29 దాకా జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ ను జూన్ తొలి వారానికి వాయిదా వేసింది. జూన్ 3 నుంచి 9వ తేదీ దాకా పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది.

2022 సివిల్స్ ఫేజ్-3 ఇంటర్వ్యూలు.. ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు జరగనున్నాయి. ఈ షెడ్యూల్ ను యూపీఎస్సీ తాజాగా ప్రకటించడంతో గ్రూప్-1 మెయిన్స్ ను వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూకి ఏపీ నుంచి 25 మంది దాకా గ్రూప్-1 అభ్యర్థులు హాజరవుతున్నారు. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకే గ్రూప్-1ను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement