ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్న వేళ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టినా ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు వేతనాలు అందిచాలని ఆదేశించింది. ఈ మేరకు ట్రెజరీ కార్యాలయాలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన పే స్కేల్ ఆధారంగానే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో జీతాల చెల్లింపునకు సీఎఫ్ఎంఎస్ ప్రత్యేక సాఫ్ట్వేర్ను సిద్ధం చేసింది. మరోవైపు పాత జీతాలే కావాలంటూ ఏపీవ్యాప్తంగా ఉద్యోగులు నిరసనలు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..