Monday, April 15, 2024

RT-PCR Test: రూ.350కే ఆర్టీపీసీఆర్‌ టెస్టు.. రేటును తగ్గించిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష ఆర్టీపీసీఆర్‌ రేటును సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఐసీఎంఆర్‌ గుర్తింపు కలిగిన ఎన్‌ఏబీఎల్‌ ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్‌ ధరను రూ.350గా నిర్ణయించింది. ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కచ్చితంగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ఆదేశించింది. జిల్లా వైద్యాధికారులు సవరించిన రేట్లకే పరీక్షలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టుకు రూ.475, అలాగే ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌లలో రూ.499 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఇకపై రూ.350 వసూలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement