Friday, March 29, 2024

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్, సర్వే ఉద్యోగుల సంఘం, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కలిసారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ సర్వే శాఖలో ప్రమోషన్లు కల్పించేలా డిపార్ట్‌మెంట్‌ను రీఆర్గనైజ్‌ చేసి 410 పోస్టులు అప్‌గ్రేడ్‌ ప్రమోషన్‌ అవకాశాలు కల్పించినందుకు సర్వే శాఖ ఉద్యోగులు ఏ.పి. గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామి రెడ్డి ఆధ్వర్యంలో  ముఖ్యమంత్రిని కృతజ్ఞతలు తెలిపారు. కాగా, సీఎం జగన్ ను కలిసిన వారిలో సర్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి చారి, వెంకట రమణారెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘం అధ్యక్ష కార్యదర్శులు అంజన్‌ రెడ్డి, అంకమరావు, భార్గవ్, కిశోర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement