Thursday, April 25, 2024

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఎవరంటే…

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాలకు నలుగురి పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేసింది. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, రమేష్ యాదవ్ ల పేర్లు ఖరారు చేసి గవర్నర్ కి పంపింది. నేడు లేదా రేపు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

కాగా నలుగురు ఎమ్మెల్సీల పదవులు శుక్రవారంతో ముగుస్తుంది. టీడీపీకి చెందిన టీడీ జనార్థన్, బీద రవిచంద్ర, జి. శ్రీనివాసులు, శమంతకమణిల పదవీకాలం ముగిసింది. ఆ స్థానాల్లో ప్రభుత్వం నలుగురు ఎమ్మెల్సీలను నియమిస్తూ.. ఆమోదం కోసం ఆ ఫైల్‌ను గవర్నర్ వద్దకు పంపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement