నేటి నుంచి ఏపీలో పాఠశాలలకు ఒక్కపూట బడులు నిర్వహించనున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు..ఆ తరువాత మధ్యాహ్న భోజనం. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి సురేష్.
ఏపీలో ఒంటిపూట బడులు
Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement