Thursday, April 25, 2024

AP: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. టైంకి ఆఫీసుకు రాకుంటే జీతం కట్..

ఉద్యోగులతో సరిగ్గా పనిచేయించుకోవడం ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి రావాలి. తమ విధులను సక్రమంగా నిర్వహించాలని ఏ ప్రభుత్వం అయినా కోరుకుంటుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సచివాలయ ఆర్థిక శాఖ అధికారులు నిర్ణీత సమయంలో కార్యాలయాలకు రావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ సమయానికి ఆఫీస్ కి రాకపోతే సెలవు కింద పరిగణించి జీతం కట్ చేస్తామని ఆర్ధిక శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఉదయం 10:10 గంటలకు ముందే ఆఫీసుకు రావాలని.. సాయంత్రం 5:30 గంటల వరకు తప్పని సరిగా విధులు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఉదయం 10:10 గంటల నుంచి 11 గంటల వరకు హాజరయ్యేందుకు నెలలో మూడు సార్లు మాత్రమే అవకాశం ఇస్తామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement