Wednesday, April 24, 2024

జగన్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర : బీజేపీపై డిప్యూటీ సీఎం సంచలన ఆరోపణ

వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓ మతత్వ పార్టీ అని, తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచి లబ్ది పొందాలని చూస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే సీఎం జగన్‌పై బురదజల్లే ఎత్తుగడలతో కార్యక్రమాలను చేపడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ఉనికే లేదని పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్‌ విగ్రహం ఏర్పాటు విషయంలో బీజేపీ రాజకీయం చేస్తోందని అంజాద్‌ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది ఆటంకం కలిగించినా.. ప్రభుత్వ అనుమతితో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఓ విధానం ఉంటుందని, అందుకు అనుగుణంగానే ఆర్ధిక వ్యవహారాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. నిబంధనలకు లోబడే రుణాలు తీసుకుంటున్నామని, రాష్ట్రానికి అవసరమైన నిధులు అందించడంలో ఉదారంగా వ్యవహరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అంజాద్‌బాషా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండిః అమరావతి ఉద్యమానికి 600 రోజులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement