Friday, April 19, 2024

ఏపీ సీఎస్ చదువుకున్న మూర్ఖుడు

ఏపీ సీఎస్‌ సునీల్ శర్మ చదువుకున్న మూర్ఖుడని సీపీఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సలహాదారులు అచ్చోసిన ఆంబోతులు మాదిరి తిరుగుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు.. సలహాదారులు ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగులు వారికి రావాల్సినవి మాత్రమే అడుగుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు అండగా ఉంటామని నారాయణ స్పష్టం చేశారు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జోవోపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉద్యోగులు ఆందోళన చేస్తున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్లమీదికొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర నిరసనలకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement