Thursday, April 25, 2024

కరోనా అప్ డేట్: ఏపీలో కొత్తగా 1,365 మంది పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 56,720 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,365 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ తో 8 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 20,42,073 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇందులో 20,14,180 మంది కోలుకున్నారు. కరోనా వైరస్ తో ఇప్పటివరకు 14,047 మంది మరణించారు. రాష్ట్రంలో 13,796 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కోవిడ్ తో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

ఇది కూడా చదవండి: Big Boss5: ఈ వారం నామినేషన్ లోకి వచ్చిందెవరంటే..?

Advertisement

తాజా వార్తలు

Advertisement