Thursday, March 28, 2024

ఏపీలో కొనసాగుతున్న కరోనా వేవ్..

ఏపీలో క‌రోనా సెంకడ్ వేవ్ ఉధృతి కొన‌సాగుతున్న‌ది. క‌రోనా కేసులు త‌గ్గిన‌ట్టుగా త‌గ్గి తిరిగి పెరుగుతున్నాయి. దీంతో ప్రతిరోజు వెయ్యికి పైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఏపీలో 1337 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్టు ఏపీ ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,38,690కి చేరింది. ఇందులో 20,09,921 మంది ఇప్ప‌టికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 14,699 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంట‌ల్లో ఏపీలో క‌రోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 14,070కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, చిత్తూరులో 231, ప‌శ్చిమ గోదావ‌రిలో 198, గుంటూరులో 141, కృష్ణాలో 144, నెల్లూరులో 139, ప్ర‌కాశంలో 161, ప‌శ్చిమ గోదావ‌రిలో 128 కేసులు న‌మోద‌య్యాయి.

ఇది కూడా చదవండి: ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ మరోసారి పొడిగింపు..

Advertisement

తాజా వార్తలు

Advertisement