Tuesday, April 16, 2024

ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..

ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో 65,500 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,506 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,835 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మంది మృత్యువాత పడ్డారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13,647కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 19,93,697 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 19,62,185 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 17,865 మంది చికిత్స పొందుతున్నారు. ఇక జిల్లాల వారిగా చూసుకుంటే అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 319 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 217, నెల్లూరు జిల్లాలో 181, పశ్చిమ గోదావరిలో 170, గుంటూరు జిల్లాలో 162, ప్రకాశం జిల్లాలో 102 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 15 పాజిటివ్ కేసులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: మోదీ ఫొటోకి పాలాభిషేకం చేస్తాః హరీష్‌ రావు

Advertisement

తాజా వార్తలు

Advertisement