Thursday, April 25, 2024

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..

ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొన్నిరోజులుగా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి.. నిన్న ఏపీలో 16 వందల కేసులు నమోదు కాగా తాజాగా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం కొత్తగా 2 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 2,498 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వైరస్‌ బారినపడిన వారిలో 2,201 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,94,4222కు పెరిగాయి. ఇప్పటివరకు1,90,7201 కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 23,843 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,178కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 88,149 శాంపిళ్లను పరీరక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: మూడు రోజుల కస్టడీకి రాజ్ కుంద్రా..

Advertisement

తాజా వార్తలు

Advertisement