Wednesday, April 24, 2024

ఏపీలో తగ్గిన కరోనా కేసులు..

ఏపీలో గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. నిన్ని రాష్ట్రవ్యాప్తంగా 43,594 శాంపిల్స్‌ పరీక్షించగా.. 739 మందికి పాజిటివ్‌గా తేలింది.. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షించిన శాంపిల్స్‌ సంఖ్య 2,69,82,681కు చేరగా… మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,22,064కు పెరిగింది. రికవరీ కేసులు 19,93,589కు చేరగా… ఇప్పటి వరకు మృతిచెందిన కోవిడ్‌ బాధితుల సంఖ్య 13,925గా ఉంది.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,550 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో నలుగురు చొప్పున, నెల్లూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 14 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు..ఇదే సమయంలో 1,333 పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్టు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయి: మంత్రి కేటీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement