Thursday, April 25, 2024

ఏపీలో కొత్తగా 1747 పాజిటివ్ కేసులు నమోదు..

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి..తాజాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,747 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ బారినపడిన వారిలో 2,365 మంది కోలుకున్నారు. ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,95,0339 పెరిగాయి. ఇవాళ్టి వరకు 1,91,4177 మంది కోలుకున్నారు. మరో 22,939 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,223కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 65,920 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది. ఇక కరోనా వల్ల చిత్తూరులో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, తూర్పు గోదావరి, ప్రకాశ, విశాఖపట్నంలో ఒక్కరుగా మృతి చెందారు.

ఇది కూడా చదవండి: ఇలా చేస్తే థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకోవచ్చు: ఎయిమ్స్ చీఫ్ గులేరియా

Advertisement

తాజా వార్తలు

Advertisement