Saturday, April 20, 2024

ఏపీలో ఒక్క రోజే 23 వేల కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 23 వేల 920 మందికి కరోనా సోకింది. 83 మంది చనిపోవడం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,14,299 శాంపిల్స్ పరీక్షించగా..23 వేల 920 మంది కరోనా బారిన పడగా…దీని కారణంగా తూర్పుగోదావరిలో 12 మంది, విశాఖపట్టణంలో ఎనిమిది మంది, అనంతపూర్ లో 8 మంది, కృష్ణాలో 8 మంది, ప్రకాశంలో ఏడుగురు, విజయనగరంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, కర్నూలులో నలుగురు చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 11 వేల 411 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement