Friday, April 26, 2024

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1,186 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 56,155 మంది నమూనాలు పరీక్షించగా 1,186 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో పది మంది మృతి చెందారు. కరోనా నుంచి 1,396 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,473 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల కృష్ణాలో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరి, చిత్తూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2015302కు చేరింది. ఇందులో 1986962 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13867 మంది మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement