Tuesday, March 26, 2024

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన ఇవాళ, రేపు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భాగంగా కర్టెన్‌రైజర్‌ కార్యక్రమాలకు సీఎం జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రేపు ఉదయం 10.30గంటల నుంచి 5-30 గంటల వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్‌ హెటల్‌లో దౌత్యవేత్తలతో జగన్‌ సమావేశమవుతారు. ఈ సమావేశానికి వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల అంబాసిడర్లతో సీఎం జగన్‌ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement