Saturday, April 20, 2024

AP: ఎక్కి ఎక్కి ఏడ్చిన చంద్ర‌బాబు.. మీడియా ముందు తీవ్ర భావోద్వేగం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర మనస్తాపానికి గుర‌య్యారు. సభలో జరిగిన ఇన్సిడెంట్స్‌ని యాది చేసుకుంటూ మీడియా ముందు ఎక్కెక్కి ఏడ్చారు. ప్ర‌ధానంగా తన భార్యను పాలిటిక్స్‌లోకి లాగడంపై ఆయన భోరున విలపించారు . ‘నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇట్లాంటి అవమానాలు ఎదుర్కోలేదు. రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నివిధాలా అవమానిస్తున్నారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలను వ్యక్తిగతంగా వేధిస్తున్నారు. కేసుల పేరుతో బెదిరిస్తున్నారు. బూతులు తిడుతూ దాడులకు పాల్పడుతున్నారు. వీటన్నింటినీ ప్రజలు చూశారు.

తాజాగా కుప్పం ఎన్నికలు పూర్తయిన తర్వాత మా డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ బీఏసీ మీటింగ్‌కి వెళితే ‘మీనాయకుడిని చూడాలనుంది. రమ్మనండి’ అని సాక్షాత్తూ సీఎం వ్యంగ్యంగా మాట్లాడితే కూడా భరించాం. అయినా అసెంబ్లీ సమావేశాలకు వెళితే చివరకు నా భార్యను కూడా ఈ డర్టీ పాలిటిక్స్‌లోకి లాగారు. నన్ను ప్రోత్సహించడం త‌ప్ప ఆమె ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలనుకోలేదు. నేను 38 ఏళ్లుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నా. ఎప్పుడూ ప్రతిపక్ష నాయకులను చులకనగా చూడ‌లేదు, మాట్లాడ‌లేదు. ఓటములు ఎదురైనా సానుకూలంగా తీసుకుని ముందుకెళ్లాను. రాష్ట్ర ప్రయోజనాలే లక్యంగా రాజకీయాలు చేశాను’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట్టర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement