Thursday, April 25, 2024

నేడు ఏపీ కేబినెట్ భేటీ… జల వివాదాలపై చర్చ!

సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. తెలంగాణ తో నెలకొన్న జల వివాదం పై క్యాబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇటీవల తీసుకువచ్చిన నూతన ఐటీ విధానంపై ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా, జాబ్ క్యాలెండర్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలతో జల వివాదాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల నియంత్రణ, అమ్మఒడిలో భాగంగా విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీ తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఐటీ విధానానికి ఆమోదం తెలుపనున్నారు. కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది.


Advertisement

తాజా వార్తలు

Advertisement