Friday, April 26, 2024

దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాండి: కార్యకర్తలకు బీజేపీ పిలుపు

దేశం కోసం, ధర్మం కోసం నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పలువురు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జిల్లా బీజేపీ శిక్ష తరగతులు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో బీజేపీ విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి అద్యక్షతన జరిగింది. ఈరోజు ఆరు కాలాంశాలపై వక్తలుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, MLC మాధవ్, జిల్లా ఇంచార్జ్ కోడూరు లక్ష్మీ నారాయణ, బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చారు. ఈ సందర్భంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సాధించిన ప్రగతిని వివరించారు. పార్టీ నిర్మాణం, బీజేపీ సైదాంతిక భూమిక గురించి కార్యకర్తలకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement