Friday, April 19, 2024

AP Assembly : నేడు కూడా టీడీపీ స‌భ్యుల స‌స్పెండ్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. అయితే నేడు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఒకరోజు పాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పది మంది సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో పాటు జీవో నెంబరు 1 ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లడంతో స్పీకర్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement