Wednesday, April 24, 2024

Flash: పెగాసెస్‌ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ హౌస్‌ కమిటీ

ఏపీలో సంచలనం రేపిన టీడీపీ పెగాసెస్‌ వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారం హౌస్‌ కమిటీ వేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించారు. అదే విధంగా కమిటీ సభ్యులుగా భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, కొలుసు పార్థసారధి, అమర్నాథ్‌, మేరుగు నాగార్జున, మద్దాల గిరిధర్‌ను నియమించారు.

కాగా రాష్ట్రంలో పెగసస్‌ స్పైవేర్‌ బాగోతం గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. టీడీపీ హయాంలో పెగసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో దుమారం రేపింది. ఈ నేపథ్యంలో గత టీడీపీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసిందా ? చేస్తే ఎప్పుడు చేసింది. దీంతో ఎలాంటి చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం పాల్పడిందని అనేది ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హౌస్‌ కమిటీ తేల్చనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement