Thursday, April 25, 2024

అలర్ట్: ఏపీలో 2 కిలో మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం..

ఏపీలో సముద్ర తీర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సముద్రంలో చోటుచేసుకుంటున్న పలు మార్పుల వల్ల తీరంలో నీరు పలు చోట్ల వెనక్కి వెళుతోంది. అంతర్వేదిలో సముద్రం తీరంలో ఉండాల్సిన నీరు 2 కిలో మీటర్లు వెనక్కి వెళ్లడంతో స్థానికుల ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో గోదావరి నది కలిసే సంగమ ప్రదేశమే అంతర్వేది. సఖినేటిపల్లి మండలంలో ఉన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉండటంతో స్వామి దర్శనానికి నిత్యం పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. కాగా.. గత కొద్ది రోజులుగా అంతర్వేది వద్ద సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది. కాగా ఇప్పుడు సముద్రం రెండు కీలోమీటర్లు వెనక్కి వెళ్లడంతో ఆందోళన మొదలైంది.

అంతర్వేదిలో నిన్న అలలు పోటెత్తి సాగరం ముందుకు చొచ్చుకుని రాగా.. కొద్దిసేపటి క్రితం ఉన్నట్టుండి రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయింది. అంతర్వేదిలో సముద్రం ముందుకు రావటం, ఉప్పాడలో సముద్రం వెనక్కు పోవటం, సముద్రం రంగు మారటం, సముద్రంలో భూకంపం రావటం ఇప్పుడు ఏపీలో సునామీ భయానికి కారణంగా మారుతున్నాయి. సముద్రంలో చోటుచేసుకుంటున్న భూ ప్రకంపనలు సునామీకి సంకేతమా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. కొన్ని చోట్ల ముందుకు, మరికొన్నిచోట్ల వెనక్కు.. అది కూడా కూతవేటు దూరంలోనే కిలోమీటర్ల మేర భిన్నమైన మార్పులు వస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. గతంలో అమావాస్య, పౌర్ణానికి ముందుకు వచ్చే సముద్రం ..గత నెల రోజులుగా 45 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది.

ఇది కూడా చదవండి: ఇక 11 రోజులే మిగిలాయి.. ఉరిశిక్ష ఎప్పుడు?

Advertisement

తాజా వార్తలు

Advertisement