Saturday, April 20, 2024

కర్నూలు మెడికల్ కాలేజీలో అనటామి పేపర్ లీక్

క‌ర్నూలు – ఎంబిబిఎస్ అనటామి టు -2 ప్రశ్నాపత్రాన్ని సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ కర్నూల్ మెడికల్ కళాశాల చెందిన ఇన్విజిలేటర్ చక్రపాణి పట్టుబడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కళాశాల అధికారులు చక్రపాణిని విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 25వ తేదీ నుండి కర్నూల్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. గురువారం అనాటమి పేపర్-2పరీక్షలు జరిగాయి. అయితే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ గా ఉన్న డాక్టర్ చక్రపాణి తన ఫోన్‌లో ఫోటో తీశాడు. ఈ విషయాన్ని గుర్తించిన చీఫ్ అభ్జర్వర్ డాక్టర్ శ్రీనివాస్ ఇన్విజిలేటర్‌ను నిలదీశారు. సెల్ ఫోన్‌ను పరీక్షా కేంద్రంలోకి ఎలా తీసుకువచ్చారని ప్రశ్నించారు. అయితే చక్రపాణి నుంచి సమాధానం లేక తప్పించుకొనేందుకు ప్రయత్నించాడు. అనంతరం ఫోన్ తీసుకొని చూడగా.. అనాటమీ పేపర్-2, అనాటమీ పేపర్-1 క్వశ్చన్ పేపర్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు ఆయన ఆదేశించారు. ఈ క్రమంలో శుక్రవారం కళాశాలలో ఈ విషయంపై విచారణ నిర్వహిస్తున్నారు. విషయం తెలిసినా మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో మెడికల్ కళాశాల వద్దకు చేరుకున్నారు. అయితే కళాశాలలోకి అధికారులు ఎవరిని అనుమతించడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement