Thursday, April 18, 2024

పోలీసుల నిర్బంధంలో అంగన్వాడీ మహిళలు

నంద్యాల, క్రైం, 19 మార్చి, ఆంధ్రప్రభ. అంగన్వాడీ ఆయాలు టీచర్లు సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా విజయవాడలో సోమవారం చలో అసెంబ్లీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా జిల్లాలో పోలీసులు రైల్వే స్టేషన్లో, ఆర్టీసీ బస్టాండ్ లో అంగన్వాడిలను నిర్బంధింఛారు. ఆదివారం రాత్రి అంగన్వాడి మహిళలను పోలీస్ స్టేషన్లకు తరలించి వారిని స్టేషన్లోనే రాత్రి నిబంధనలకు విరుద్ధంగా నిర్బంధిస్తున్నారు. విజయవాడకు మేము వెళ్ళమని వారితో వ్రాయించుకొని మరల సోమవారం ఉదయం స్టేషన్ కొచ్చి సంతకం చేయాలని హెచ్చరిస్తున్నారు. ఒప్పుకున్న వారిని ఇంటికి వెల్లనిస్తున్నారు నిరాకరించిన వారిని స్టేషన్లోనే నిర్బంధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement