Saturday, April 20, 2024

AP Corona: ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా ఎన్నికేసులంటే..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 22,882 మంది సాంపిల్స్ ని పరీక్షించగా.. కొత్తగా 4,108 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే, కరోనా వల్ల మరణాలు సంభవించలేదు. అదే సమయంలో 696 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు, విశాఖ జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు వెలుగు చూశాయి. గుంటూరులో 345, కడపలో 295, నెల్లూరులో 261, ప్రకాశంలో 176, కృష్ణాలో 170 అనంతపురంలో 162, తూర్పుగోదావరిలో 263, శ్రీకాకుళంలో 114, విజయనగరంలో 169, పశ్చిమగోదావరి జిల్లాలో 46 కేసులు బయటపడ్డాయి.

దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 21,10,388కి చేరింది. ఇందులో 20,65,696 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 14,510 మంది కరోనాకు బలైయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,182 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement