Thursday, April 25, 2024

ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా.. జిల్లాల్లో నమోదైన కేసులు ఇవే..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 50,463 శాంపుల్స్ ని పరీక్షించగా 865 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 1,424 మంది కోలుకోగా..  9 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 10,574కి చేరింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 20,51,998కి చేరింది. ఇందులో ఇప్పటివరకు 20,27,229 మంది కోలుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 172 కేసులు కేసులు నమోదుకాగా… అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో 10కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. కర్నూలు, శ్రీకాకుళంలో నాలుగు కేసుల చొప్పున నమోదయ్యాయి. 

ఇది కూడా చదవండిః భయపడే వ్యక్తిని కాదు…తొక్కతీసి నార తీస్తాః వైసీపీకి పవన్ వార్నింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement