Wednesday, March 27, 2024

AP Corona Update: రాష్ట్రంలో కొత్తగా 517 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,786 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 517 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో 826 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,58,582కు చేరింది. ఇందులో 20,37,691 కోవిడ్ నుంచి కోలుకున్నారు. కోవిడ్‌ బారినపడి ఇప్పటి వరకు 14,276 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,615 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తాజా కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 97, తూర్పు గోదావరిలో 88, గుంటూరులో 84 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ కు అమిత్ షా ?.. కేసీఆర్ సభకు చెక్!

Advertisement

తాజా వార్తలు

Advertisement