Friday, April 19, 2024

Covid-19: ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 31,987 మందిని పరీక్షలు చేయగా.. కొత్తగా 264 మంది కరోనా సోకింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 46 కేసులు నమోదకాగా.. కర్నూలులో అత్యల్పంగా మూడు కేసులు మాత్రమే వెలుగు చేశాయి.

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 247 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే, కొవిడ్ బారినపడి కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,71,831కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,175 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 14,430 మంది ప్రాణాలు కోల్పోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement