Thursday, April 25, 2024

Good News: ఏపీలో కరోనా కేసులు ఎన్నంటే..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 30,979 మంది సాంపిల్స్ ని పరీక్షించగా.. 154 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల గుంటూరులో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అదే సమయంలో 177 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 30 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక కేసు రికార్డు అయ్యింది.

రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,73,730కి చేరింది. ఇందులో 20,57,156 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,122 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 14,452 మంది కరోనా మహమ్మారికి బలైయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement