Thursday, March 28, 2024

AP Corona: ఏపీలో కరోనా కేసులు ఎన్నంటే..

ఏపీలో కరోనా మహమ్మారి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 25,925 మంది సాంపిల్స్ ని పరీక్షించగా.. 184 కోవిడ్ కేసుల నమోదు అయ్యాయి. కోవిడ్ వల్ల చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరుచొప్పున మరణించారు. గత 24 గంటల్లో 134 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులైయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 20,72,909కి చేరింది. ఇందులో 20,56,318 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 14,442 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,149 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,04,17,082 మంది సాంపిల్స్ ని పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement