Thursday, April 25, 2024

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 57,345 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..1084 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 1328 మంది కోలుకున్నారు. మరో 13 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,49,314కి చేరింది. ఇందులో 20,23,496 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14,163 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,655 మంది కోవిడ్ కేసులు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: పంజాబ్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

Advertisement

తాజా వార్తలు

Advertisement