Thursday, March 28, 2024

ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా.. జిల్లాల్లో నమోదైన కేసులు ఇవీ

ఏపీలో కరోనా కేసులు నిన్నటితో పొలిస్తే.. స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 46,558 మంది సాంపిల్స్ పరీక్షించగా.. 800 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కోవిడ్ తో తొమ్మిది మంది చనిపోయారు. అదే సమయంలో 1,178 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,54,663కి చేరగా.. ఇందులో 20,31,681కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,754 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 14,228 మంది కరోనాకు బలైయ్యారు.

రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 126 నమోదు కాగా.. అత్యఅల్పంగా శ్రీకాకుళం జిల్లాలో రెండు కేసులు నమోదైయ్యాయి. చిత్తూరులో 120,గుంటూరులో 111, పశ్చిమగోదావరి జిల్లాలో 104, అనంతపురంలో 12, చిత్తూరులో 120, కడపలో 27, కృష్ణాలో 73, కర్నూలు 3, నెల్లూరు 84, ప్రకాశంలో 98, విశాఖ 32, విజయనగరంలో 8 కేసులు రికార్డు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement