Tuesday, April 23, 2024

జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్ శాఖకు అవార్డులు

జాతీయ స్థాయిలో టెక్నాలజి వినియోగంలో తాజాగా మరో 15 అవార్డులను ఎపి పోలీస్ శాఖ దక్కించుకుంది. టెక్నాలజీ సభ- 2022 ప్రకటించిన అవార్డులలో 15 అవార్డులను వివిధ విభాగాల్లో కైవసం చేసుకొని, మొత్తం 165 అవార్డు లను గెలుచుకుంది. టెక్నాలజీ వినియోగంలో జాతీయస్థాయిలో 165 అవార్డులతో మొదటి స్థానంలో ఏపీ పోలీస్ శాఖ నిలిచింది. టెక్నాలజీ వినియోగిస్తూ జాతీయ స్థాయిలో అవార్డుల దక్కించుకోవడంతో తమపై ప్రజలకు సేవ చేసే బాధ్యత మరింతగా పెంచింది.

పోలీస్ ప్రధాన కార్యాలయంతోపాటు వివిధ జిల్లాలో అవార్డులను సాధించిన సిబ్బందిని డిజిపి అభినందించారు. జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement