Thursday, April 25, 2024

పెంపుడు కుక్కకు కాంస్య విగ్రహం!

మనుషుల కంటే కుక్కలకే ఎక్కువగా విశ్వాసం ఉంటుందని ఉంటారు. చాలా మంది పెంపుడు జంతువులను తమ కన్న బిడ్డల్లా చూసుకుంటారు. పెంపుడు కుక్కపై అమితమైన ప్రేమను పెంచుకున్న ఓ యజమాని… చనిపోయిన కుక్కకు విగ్రహం చేయించి పూజలు కూడా చేస్తున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామానికి చెందిన సుంకర జ్ఞానప్రకాశరావు గతంలో ఓ కుక్కను పెంచుకున్నారు. దానికి శునకరాజు అని పేరుపెట్టడమే కాకుండా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూసుకున్నాడు. ఆ శునకం కూడా జ్ఞానప్రకాశరావుపై ఎంతో విశ్వాసంతో ఉండేది. ఆయన చెప్పినదల్లా అర్ధం చేసుకునేది. అయితే, ఐదేళ్ల క్రితం పెంపుడు కుక్క శునకరాజు మరణించింది. అప్పటి నుంచి దాని జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాడు. ప్రతి ఏడాది దాని వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే, తమ పెంపుడు కుక్క జ్ఞాపకాలను మరచిపోలేని జ్ఞానప్రకాశరావు కుటుంబం దానికి ఏకంగా కాంస్య విగ్రహం చేయించింది. ఇంటి దగ్గరే విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాని ఆత్మహకు శాంతి కలగాలంటూ పండితులను పిలిచి శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండిః దళిత బంధు సభ.. టీచర్లకు జనసమీకరణ బాధ్యత!

Advertisement

తాజా వార్తలు

Advertisement