Friday, April 19, 2024

రేపే ఏపీ కేబినెట్ భేటీ.. కరోనా కట్టడిపై చర్చ!

ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం సచివాలయంలో జరుగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే వేర్వేరు కారణాల వల్ల రెండు సార్లు వాయిదా పడింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా బుధవారం(మే 5) మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ విధించే అంశాన్ని కేబినెట్ ఆమోదించనుంది. గతంలో పెండింగ్​లో ఉన్న వివిధ అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement