Thursday, April 18, 2024

జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి చూసి ఓటు వేయండి

లేపాక్షి – స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా హిందూపురం ఇంచార్జి ఎమ్మెల్సీ ఇక్బూల్ భాషా లేపాక్షి మండలంలో జడ్పీటీసీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి తరుపున అలానే కంచిసముద్రం, శిరివరం, మానేపల్లి, తిలక్ నగర్ ఎంపీటీసీ అభ్యర్థుల తరుపున సోమవారం రోజున ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ప్రతి ఒక్కరు వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని,కొండూరు మల్లికార్జున, జడ్పీటీసీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి,సర్పంచులు అశ్వర్త నారాయణ,గంగాదేవి,నిర్మల,వైసిపి శ్రేణులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement