Friday, April 19, 2024

పాము కాటుతో మహిళ మృతి

యల్లనూరు : సింగనమల నియోజకవర్గం యల్లనూరు మండల పరిధిలోని బుక్కాపురం గ్రామంలో అదే గ్రామానికి చెందిన మహిళా బుధవారం పాము కాటుకు గురై మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా బుక్కాపురం గ్రామానికి చెందిన పుల్లమ్మ (66) పొలంలో మంగళవారం గడ్డి తొల‌గిస్తుండ‌గా కుడి చేతికి పాము కాటు వేసింది. సమీపంలోని ఉన్న స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించారు. అప్ప‌టికే ఆమె మృతిచెందిన‌ట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement