Thursday, April 25, 2024

చంద్రబాబు ఆదేశాలు పాటిస్తాం…

పెనుగొండ – హిందూపురం టిడిపి అధ్యక్షుడు, పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బికె పిలుపుమేరకు నేడు మాజీ ఎంపీపీ కేశవయ్య అతిథిగృహం మందు టిడిపి నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వ పేర్కొన్నారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న టిడిపి ఎంపిటిసిలు పోటీకి ఆసక్తి చూపిన ప్రతి ఒక్కరికి వందనాల‌ని, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు భవిష్యత్తులో గుర్తింపు ఇస్తామని తెలిపారు ఈ ఎన్నికల్లో ఏ విధంగా జరుగుతున్న విషయం అందరికి తెలిసిందేన‌న్నారు. దౌర్జన్యాలు పేరుతో ఏకగ్రీవ లకు వైసిపి పాల్పడుతోందని రీ నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీలతో ఇతర పార్టీలు కూడా డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా నిర్వహిస్తున్నారన్నారు. పెనుగొండ జడ్పిటిసి అభ్యర్థిగా బి ఫారం తీసుకొని వై ఎస్ ఆర్ సి పి కండువా వేసుకోవడం సిగ్గుచేటన్నారు అతడిని టిడిపి పార్టీ నుండి సస్పెండ్ చేశామన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి స వితమ్మ మాజీ ఎంపిపి కేశవయ్య మండల కన్వీనర్ శ్రీ రాములు రాంపురం సర్పంచ్ శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ రెడ్డి ఇ సోమశేఖర్ గోపాల్ ఆల్ సి దయ పోతిరెడ్డి బాబుల్ రెడ్డి ఇతర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement