Friday, March 29, 2024

వైఎస్సార్ సీపీ వర్గీయులపై టీడీపీ దాడి

తాడిపత్రి : అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామంలో సోమవారం ఉదయం వైఎస్సార్ సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ వర్గీయులు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో టీడీపీ వర్గీయుడు నారాయణ రెడ్డికి వైఎస్సార్ సీపీ వర్గీయుడు ఎర్ర గుడి రామ్మోహన్ రెడ్డిల మధ్య రస్తా విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ విషయం గా ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకుంటూ నే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం టీడీపీకి చెందిన నారాయణ రెడ్డి వర్గీయులు వైఎస్సార్ సీపీకి చెందిన ఎర్రగుడి రామ్మోహన్ రెడ్డి వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎర్రగుడి రామ్మోహన్ రెడ్డి, అతని కొడుకు వై. వినయ్ కుమార్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని తాడిపత్రి ప్రభుత్వాసుపత్రి కి తరలించి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రి కి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement