Friday, April 26, 2024

తాడిమ‌ర్రి ఘ‌ట‌న‌పై మంత్రి పెద్దిరెడ్డి దిగ్భ్రాంతి

సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో విద్యుత్ వైర్లు తెగిపడి ఆటోలో పలువురు సజీవ దహన‌మైన ఘటన పై ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంట‌నే ఈ ఘ‌ట‌న‌పై విచారణ జ‌ర‌పాల‌ని మంత్రి ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామ‌న్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement